Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దంపతుల ప్రాణాలు తీశాడు

హైదరాబాద్ లో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ పై వెళ్తోన్న భార్యాభర్తలను బలంగా ఢీకొట్టాడు.

Road Accident : మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దంపతుల ప్రాణాలు తీశాడు

The Couple Killed In A Road Accident At Narsingi Hyderabad

couple killed in a road accident : హైదరాబాద్ లో మరో తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తోన్న వ్యక్తి నార్సింగ్ లో బైక్ వెళ్తోన్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సంజయ్ మద్యం మత్తులో కారు నడిపారు. అతనికి డ్రంకన్ డ్రైవ్ టెస్టులో 148 రీడింగ్ వచ్చింది. ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. 12 గంటల వ్యవధిలో ఇది రెండో ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..పీకలదాక మద్యం తాగి క్వాలిస్ వెహికిల్ నడుపుతున్న సంజయ్ (35) నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై వెళ్తోన్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. కారులో కొంపల్లికి వెళ్తోన్న సంజయ్..కొకాపేట నుంచి బైక్ పై వస్తున్న దంపతులను ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతి వేగంగా వచ్చిన కారు.. బైక్ పై వెళ్తోన్న భార్యాభర్తలను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న భార్య ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందారు.

Rowdy Sheeter : పుస్తకాలు, పెన్నులు ఆశచూపి ఆడపిల్లలపై లైంగిక వేధింపులు..రౌడీ షీటర్ కు దేహశుద్ధి చేసిన మహిళలు

అలాగే బైక్ నడుపుతున్న భర్త కూడా తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావమై రోడ్డుపైనే మృతి చెందాడు. సంజయ్ మద్యం తాగి కారు డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నగర శివారు అయిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ వోడీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి సైన్ బోర్డులు లేకపోవడం గమనార్హం.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి, ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సంజయ్, మృతుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.