Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి

ఆదిలాబాద్‌ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు.

Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి

Dauter Kill

father murdered daughter : రోజు రోజుకు మనిషిలో మానవత్వం నశిస్తోంది. సమాజంలో కొంతమంది కుల మాతాల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. మనుషుల ప్రాణాల కంటే కుల, మతాల కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తున్నారు. ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను హత మారుస్తున్నారు. పరువు కోసం కన్న కూతురు, కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తున్నారు. పరువు పేరుతో కన్నబిడ్డలనే కడతేర్చుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కంప్యూటర్ యుగంలో ఉన్నా.. కుల మత దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనేవున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో పరువు కోసం ఏకంగా కూతురి ప్రాణాలనే తీశాడో తండ్రి. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. గొంతు కోసి చంపేశాడు. ఇన్నేళ్లు ప్రేమగా పెంచి, మమకారం పంచిన తండ్రే.. పరువు కోసం కర్కోటకుడిగా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని పెంచిన చేతులతోనే చంపేశాడు. పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చాడు.

Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష

నార్నూరు మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన రాజేశ్వరి, అదే గ్రామానికి చెందిన షేక్ అలీంను ప్రేమించింది. అయితే పెళ్లికి రాజేశ్వరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. దీంతో రాజేశ్వరి తండ్రి గామంలో పంచాయితీ పెట్టాడు. కొద్ది రోజుల వరకు విడివిడిగా ఉండాలని పెద్దలు చెప్పడంతో.. ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.

నిన్న ఉదయం పెళ్లి విషయంలో రాజేశ్వరికి, ఆమె తండ్రి మధ్య వాగ్వాదం జరిగింది. షేక్‌ అలీంను మరచిపోవాలని దేవదాస్.. కూతురు రాజేశ్వరిని హెచ్చరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. విచారణలో దేవదాస్ నేరం అంగీకరించడంతో.. నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.