Dog Attack Case : బాలుడిపై కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

Dog Attack Case : బాలుడిపై కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

High Court Sumoto

Dog Attack Case : హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కల దాడి కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గురువారం (ఫిబ్రవరి23, 2023) బాలుడిపై కుక్కల దాడి కేసును హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే విధంగా జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ ను ప్రతివాదులుగా చేరుస్తూ ఈ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

మూడు రోజుల క్రితం కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ అంబర్ పేటలో బాలుడిపై కుక్కల దాడి జరిగిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల కుక్కలు దాడి చేయడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుక్కల దాడి ఘటనపై అంబర్ పేటకు సంబంధించిన బాలుడి తల్లిదండ్రులతోపాటు స్థానికులు కూడా జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

MLA Rajasingh Demand Financial Assistance : కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి : ఎమ్మెల్యే గోషామహాల్

అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి తన శక్తి మేర ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. జంతువును వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిని అన్నివైపుల నుంచి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చాడు.

నగరంలోని అంబర్ పేట ‘చే నెంబర్’ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ తో కలిసి అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో గంగాధర్ ఇద్దరు పిల్లలను వెంట బెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ కు వెళ్లాడు.

Dogs’ Attack In Hyderabad: కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం.. దాడిపై కేటీఆర్ స్పందన

కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి, కుమారున్ని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటుూవుండటంతో మరో వాచ్ మెన్ తో కలిసి గంగాధర్ పని మీద బయటికి వచ్చాడు. అయితే, కాసేపు అక్కడే ఆడుకున్న బాలుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేసి, చంపేశాయి.