వరుడికి కరోనా సోకడంతో ఆగిన పెళ్లి

  • Published By: bheemraj ,Published On : August 8, 2020 / 10:09 PM IST
వరుడికి కరోనా సోకడంతో ఆగిన పెళ్లి

వ‌రుణికి క‌రోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జ‌ర‌గాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో పెళ్లి ఆగిపోయింది. రాజీవ్‌నగర్‌కు చెందిన వరుడికి కోనరావుపేట మండలం కొలనూర్‌కు చెందిన యువతితో (ఆగస్టు 9, 2020)న వివాహం నిశ్చయమైంది.

వరుడు మున్సిపల్‌లో బిల్‌కలెక్టర్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజు క్రితం మున్సిపల్‌లో తోటి ఉద్యోగికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న పెళ్లికొడుకుకు కూడా పరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ఆదివారం జరుగాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పడింది.