Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నిందితుడిని పెళ్లి చేసుకున్న యువతి

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.

Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నిందితుడిని పెళ్లి చేసుకున్న యువతి

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి షాకిచ్చింది. తాను కిడ్నాప్ కాలేదని, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఉదయం కొంతమంది దుండగులు షాలినీ అనే యువతిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

చందుర్తి మండలం మూడపల్లిలో గోలి షాలిని అనే యువతిని ఉదయం కొందరు వ్యక్తులు కారులో ఎత్తుకెళ్లారు. నిందితులు ముసుగులు ధరించి ఉన్నారు. అడ్డొచ్చిన యువతి తండ్రిపైనా దాడి చేశారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే, కిడ్నాపైన యువతి తాజాగా ట్విస్ట్ ఇచ్చింది. తానేం కిడ్నాప్ కాలేదని, తను ప్రేమించిన జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని వెల్లడించింది. పెళ్లికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు వీడియోలో పేర్కొంది. జానీని తాను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఇష్టపూర్వకగానే అతడితో వెళ్లానని షాలిని వీడియోలో చెప్పింది.

House tax notices for Taj Mahal : తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు..రూ.1.కోటి చెల్లించాలని, లేకుంటే జప్తు చేస్తామని ఆదేశం

తన కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వచ్చేసినట్లు వివరించింది. ప్రస్తుతం జానీ-షాలినీ రహస్య ప్రదేశంలో పెళ్లి చేసుకున్నప్పటికీ, వీళ్లిద్దరికీ గతంలోనే పెళ్లి జరిగింది. ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. కాగా, మాస్క్ ధరించడం వల్లే జానీని గుర్తుపట్టలేదని, అందువల్లే కిడ్నాప్ చేస్తున్నారని భావించినట్లు షాలిని తెలిపింది. పెళ్లి వీడియోలను షాలిని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.