Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి

ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి

Accident (3)

Three killed in road accident : అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి చేరుకునే వరకూ దినదిన గండంగా నడుస్తోంది. తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి హైదరాబాద్ నగర శివార్లలో జరిగింది. ఓ కారు అతివేగానికి ఎదురు రోడ్డులో వస్తున్న అమాయకులు బలైపోయారు. కారు అదుపుతప్పి అవతలి రోడ్డులోకి వచ్చి మరీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జాతీయ రహదారిపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై అత్వెలి గ్రామ సమీపంలో ఘోర ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అతివేగంగా వచ్చిన కారు.. అదుపు తప్పి.. డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆటోను ఢీ కొట్టింది. అంతటితో ఆగలేదు. బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లి.. ఓ లారీ కిందకు దూసుకెళ్లి ఆగింది. రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన కారు అమాయకులను బలి తీసుకుంది.

Apollo : సాయిధరమ్ తేజ్ హెల్త్, నిర్లక్ష్యమే కారణం!

స్పాట్‌లో కారు ఉన్న తీరు.. ప్రమాద తీవ్రతకు అద్ధం పడుతోంది. బైక్ పైకి కారు ఎక్కింది. కారు కింద ఓ మృతదేహం పడి ఉంది. బైక్‌పై వెళ్తున్న సుధీర్ అనే యువకుడు, ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య, ఆమె మూడేళ్ల కుమారుడు కౌశిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కావడంతో.. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కారు డ్రైవర్ అతివేగానికి పక్క రోడ్డులో వెళ్తున్న అమాయకులు బలి కావడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు గుర్తించారు. రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన కారు.. ఆటో, బైక్‌ను ఢీకొట్టినట్లు చెప్పారు.