ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి 

  • Published By: bheemraj ,Published On : June 4, 2020 / 12:32 AM IST
ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఛత్తీ‌సగఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లా జీడిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు ధాన్యం మిల్లు పట్టించడానికి ట్రాక్టర్‌లో చర్లకు వెళ్లారు. దాదాపు 20 మంది ఆదివాసీలు బియ్యంతో పాటు యూరియా బస్తాలు వేసుకుని తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. 

తాలిపేరు ప్రాజెక్టు శివారుకు రాగానే ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న బియ్యం, యూరియా బస్తాలు వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బండా లక్ష్మి(50), బండా లచ్చి (35), వెలగం రాధ (40) అక్కడికక్కడే మృతి చెందారు. పండా అందెయ్య, వెలకం బుచ్చయ్య, వెలకం ముత్తయ్య గాయపడగా చికిత్స నిమిత్తం చర్ల ఆసుపత్రికి తరలించారు. 

ట్రాక్టర్‌ ను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సమీపంలోని సీఆర్‌ఫిఎఫ్‌ 151 బెటాలియన్‌ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బాధితులకు సాయం చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం 108 అంబులెన్స్ లో చర్ల హాస్పిటల్ కు తరలించారు.

Read: పెళ్లి పేరుతో మహిళ ఘరానా మోసం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.కోటి కాజేసింది