Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.

Yashwant Sinha: నేడు హైదరాబాద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్

Yaswanth Sinha

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ కు చేరుకుంటారు. జలవిహార్ లో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్ సిన్హా కోరనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం కానున్నారు.

BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు

హైదరాబాద్ లో నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానుండటం, సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..

యశ్వంత్ సిన్హా పర్యటన ఇలా..
– ఉదయం 9.45 గంటలకు ప్రత్యేక విమానంలో రాయ్‌పూర్ నుండి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బయలుదేరుతారు.
– ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
– విమానాశ్రయం వద్ద సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతారు.
– ఎయిర్ పోర్టు నుంచి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీగా జలవిహార్‌ కు చేరుకుంటారు.
– మధ్యాహ్నం 12 గంటలకు జలవిహార్ లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు.
– మధ్యాహ్నం 1.00 గంటలకు సీఎం కేసీఆర్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు.
– మధ్యాహ్నం 3.30 గంటలకు హోటల్ ఐటీసీ కాకతీయలో ఏఐఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు.
– సాయంత్రం 4.15 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
– సాయంత్రం 4.45 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు టేకాఫ్ అయ్యి.. 5.45 గంటలకు బెంగళూరు చేరుకుంటారు.