Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీవి చిల్లర రాజకీయాలు : రేవంత్ రెడ్డి

సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు.

Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీవి చిల్లర రాజకీయాలు : రేవంత్ రెడ్డి

Revanth

Revanth Reddy : టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి టీఆర్ఎస్, బీజేపీ చిల్లర రాజకీయాలకు తెర లేపారని మండిపడ్డారు. కల్లు కంపౌండ్ లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ కంపెనీల పైసలతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందన్నారు.

ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, రైల్వే కోచ్ తదితర వాటిని కాంగ్రెస్ చట్టబద్ధంగా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ హామీల విషయంలో కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే.. 16 నెలలు అటువైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేదన్నారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై ప్రశ్నించలేదని పేర్కొన్నారు. పునర్విభజన చట్టం.. మోదీ ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో కేసీఆర్ కు అవకాశం ఉన్నా వదిలేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఛీప్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Revant Reddy : మోడీ చేతిలో కేసీఆర్ కీలు బొమ్మ : రేవంత్ రెడ్డి

సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో అగ్నిపథ్ విషయంలో జరిగిన కాల్పులు ఎవరు చేశారనేది స్పష్టం చేయలేదని చెప్పారు.

లోపభూయిష్టంగా ఉన్న అగ్నిపథ్ పథకంపై మోదీని నిలదీయాలన్నారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా టీఆర్ఎస్ జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని ప్రశ్నించారు. నిన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన టీఆర్ఎస్ జెండాలన తొలగిస్తే.. ఈ రోజు మళ్లీ కట్టారని పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.