Revanth Reddy in USA : కేసీఆర్ దోపిడీని ఇంకెంత కాలం భరిద్దాం..? : రేవంత్ రెడ్డి

అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Revanth Reddy in USA : కేసీఆర్ దోపిడీని ఇంకెంత కాలం భరిద్దాం..? : రేవంత్ రెడ్డి

Revanth Reddy in USA

Telangana Formation Day 2023 celebrations in USA : అమెరికా న్యూజెర్సీలో తెలంగాణ అవిర్భవ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం..? అని ప్రశ్నిస్తు.. తెలంగాణ అభివృద్ధి లో ఎన్. ఆర్. ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించారని అన్నారు. ఎంతోమంది తెలంగాణ కోసం శ్రమించి ప్రాణాలకు తెగించి పోరాడి రాష్టాన్ని ఏర్పాటు చేసుకుంటే…ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతోంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలతో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంటం దోచుకు తింటోంది అంటూ మండిపడ్డారు. రాజకీయాలను అవినీతి మయం చేశారని ఆరోపించారు.

 

అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో 9 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారని.. 17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చిందన్నారు. 22 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

 

తెలంగాణ కోసం పోరాటం చేసిన అని చెప్పిన టీఆర్ఎస్ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారనీ..కానీ కేసీఆర్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన చెయ్యలేదని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలని ఈ సందర్బంగా సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.