Revanth Reddy : ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారు : బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు.

Revanth Reddy : ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారు : బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy

Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపెట్ లో ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారని చెప్పారు. చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయమని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని పేర్కొన్నారు. తమ ఆత్మగౌరవం ముగిసిన అధ్యాయమైతే… తెలంగాణలో కేసీఆర్ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందని తేల్చి చెప్పారు.

3లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో చక్కెర కర్మాగారాన్ని నడపలేరా? అని ప్రశ్నించారు. చక్కెర కర్మాగారాన్ని కూడా నడిపించలేని కేసీఆర్ రాష్ట్రాన్ని నడపలేరని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఇక ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానన్న వ్యక్తి శంకరగిరి మాన్యాలు తిరుగుతున్నాడని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. వరి వేస్తే ఉరే అని ప్రకటించాడని చెప్పారు.  కేసీఆర్ చెబుతున్న అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదేనా? అని నిలదీశారు. తెలంగాణను సీడ్ బౌల్ అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిశ్రమలను మూసేస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy : అధికారంలోకి వస్తే.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, రూ.2లక్షలు రుణమాఫీ-రేవంత్ రెడ్డి

తెలంగాణలో వ్యవసాయాన్ని చంపేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 10 లక్షల ఎకరాల చెరుకు రైతులను ఆదుకునే ఫ్యాక్టరీని ఎందుకు తెరవరని ప్రశ్నించారు. రైతుల కోసం 0.1 శాతం నిధులు కేటాయించలేరా అని నిలదీశారు. కేసీఆర్ కు సవాల్ విసురుతున్నానని.. కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ పాలనపై చర్చ పెడదామని చెప్పారు. వ్యవసాయ మంత్రి వస్తాడా, ఐటీ మంత్రి వస్తాడో మీ ఇష్టం అని అన్నారు. తమది రైతులను ఆదుకునే విధానం.. బీఆర్ఎస్ ది రైతు ఆత్మహత్యల విధానమని విమర్శించారు.

హర్యానా మాదిరిగా ఇక్కడి రైతులు లాభసాటి పంటలు పండిస్తారని అన్నారు. ఇక్కడి రైతులు పది మందికి పని కల్పించి, పట్టెడన్నం పెట్టి ఆదుకుంటున్నారని కొనియాడారు. గోదావరి జిల్లాల కంటే ఈ ప్రాంత రైతులు శ్రీమంతులు అని అభిర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో రైతులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని చెప్పారు.

Revanth Criticized BRS Govt : బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా? : రేవంత్ రెడ్డి

కేసీఆర్ పై కోపంతో బీజీపీ వైపు వెళ్లొద్దని సూచించారు. బీజేపీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికార మదాన్ని అణచివేయాలని పిలుపునిచ్చారు.కొత్త ప్రభుత్వంలో ఆరు నెలల్లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత తమదన్నారు. రాష్ట్రంలో చత్తీస్ ఘడ్ మోడల్ పాలన అవసరం అన్నారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు 9వేలు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.

రైతు వ్యతిరేక నల్ల చట్టాలపై పోరాడి చట్టాలను మోదీ వెనక్కు తీసుకునేలా చేసిన ఘనత రైతులదని కొనియాడారు. మోదీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో మీరు ఏకం కావాలన్నారు. రాజకీయ పార్టీల చుట్టూ తిరగనవసరం లేదని.. ఏకమై పోరాడితే…మీ వెంటే రాజకీయ పార్టీలు వస్తాయని చెప్పారు. ఫ్యాక్టరీ ఎట్ల తెరుచుకోదో.. పసుపు బోర్డు ఎట్ల రాదో చూద్దామన్నారు. మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కంటే రైతుల మేలుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.