సీఎం ఆదేశాలు పట్టించుకోకుండా పోడు భూముల్లో ట్రెంచ్ పనులు..గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ జిల్లా లైన్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు.

సీఎం ఆదేశాలు పట్టించుకోకుండా పోడు భూముల్లో ట్రెంచ్ పనులు..గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

Trench works blocked : మహబూబాబాద్ జిల్లా లైన్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. సీఎం ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ జేసీబీ ముందు పడుకున్నారు. దీంతో గిరిజన రైతులను పోడు భూముల్లోనుంచి అటవీశాఖ అధికారులు ఈడ్చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

అటవీశాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు.