Mahabubabad : అటవీశాఖ అధికారిపై దాడి చేసిన ఆదివాసీలు

మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడి చేశారు.

Mahabubabad : అటవీశాఖ అధికారిపై దాడి చేసిన ఆదివాసీలు

Mahabubabad

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలోని పోడు భూముల సాగు కోసం దుక్కి దున్నారు ఆదివాసీలు. దుక్కి దున్నుతున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్ ఆదివాసీ రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారిపై దాడి చేశారు.

అటవీ అధికారిపై దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆదివాసీలు. తమ భూముల్లో తాము సాగుచేసుకుంటుంటే అడ్డుకోడానికి మీరెవరని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నవన్నీ తమ భూములని ఇక్కడే వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు వచ్చి భూములు లాక్కుంటే తామేమైపోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో అధికారులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తరలించారు పోలీసులు