TS High Court : టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య.. కాంగ్రెస్ నేత ప్రమేయం లేదన్న హైకోర్టు

టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డికి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

TS High Court : టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య.. కాంగ్రెస్ నేత ప్రమేయం లేదన్న హైకోర్టు

Ts High Court

TS High Court : టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో కాంగ్రెస్ నేతకి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే 2017 జులై 13న టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హన్మకొండలో హత్యకు గురయ్యారు.

Read More :  Bhubaneswar : అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతుంది..ఛాటింగ్ చేస్తుంది, తర్వాత…

ఈ కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.ఎఫ్ఐఆర్ లో రాజేందర్ రెడ్డి ఏ-4గా ఉన్నారు.

అయితే రాజకీయ కక్షసాధింపు నేపథ్యంలోనే తనను ఈ కేసులో ఇరికించారని రాజేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసుల నుంచి సాంకేతిక ఆధారాలు ఏమి లేకపోవడంతో రాజేందర్ రెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.

Read More : Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి

ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన రాజేందర్ రెడ్డి రాజకీయ కక్షలతో తనపై కేసు పెట్టారని, కానీ చివరికి న్యాయమే గెలిచిందని భావోద్వేగానికి గురయ్యారు.