TRS MLC Warn To Bandi sanjay : కేసీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే బండి సంజయ్ నాలుక చీరేస్తా..

‘బండి సంజయ్ నాలుక చీరేస్తా’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు.

TRS MLC Warn To Bandi sanjay : కేసీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే బండి సంజయ్ నాలుక చీరేస్తా..

TRS MLC Warning To Bandi sanjay

TRS MLC Warning To Bandi sanjay : ‘బండి సంజయ్ నాలుక చీరేస్తా’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు వార్నింగ్ ఇచ్చారు. బండి సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని..ఇష్టానురీతిగా సీఎం కేసీఆర్ గురించి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరాస్తా జాగ్రత్త అంటూ బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు శంభీపూర్ రాజు. మేము తలచుకుంటే బండి సంజయ్ యాత్ర ముందుకు సాగకుండా ఆపివేయగలమని..ఈ విషయాన్ని బండి గుర్తుపెట్టుకోవాలి అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

కాగా..బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టినప్పటినుంచి తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి ఏమాత్రం తీసిపోకుండా టీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ బీజేపీ నేతలతో పాటు కేంద్రంలో ఉన్న నేతలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.ఇలా ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు.దీంట్లో భాగంగానే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హద్దులు దాటి సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్… ఎక్కడ మాట్లాడినా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. జనగాం పర్యటనలో కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు బండి సంజయ్.

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన కామెంట్లకు కారు పార్టీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సంజయ్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. సీఎం కేసీఆర్‌పై అనుచితింగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే బండి అడుగు ముందుకు వేయలేరన్నారు. బండి సంజయ్ చేయాల్సింది పాదయాత్ర కాదు.. తెలంగాణకు నిధుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా మతాల మధ్య చిచ్చు పెట్టేలా బండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే సంక్షేమంపై మాట్లాడాలని సంజయ్ కి ఆయన సవాల్ చేశారు.