Police Recruitment: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకారం

ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. 7 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Police Recruitment: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకారం

Police Recruitment: తెలంగాణలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అభ్యర్థులు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు 7 మార్కులు కలిపేందుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Gujarat: పంచాయత్ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం

ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో వివాదం తలెత్తింది. 7 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. అయితే, వాటిలో తాము నిర్ధరించుకున్న వాటిని మాత్రమే సరైన సమాధానంగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై పరీక్షకు హాజరైన అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలున్నప్పుడు ఏదో ఒక దానిని మాత్రమే సమాధానంగా గుర్తించడం సరికాదని, దీనివల్ల ఇతర సమాధానాలు ఎంపిక చేసుకున్న వాళ్లు అన్యాయానికి గురవుతారని వాదించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో టీఎస్ ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ ఏడు ప్రశ్నల విషయంలో ఏ సరైన సమాధానం రాసినా సరే వారికి అదనంగా ఏడు మార్కుల వరకు కలపాలని ఆదేశించింది. కోర్టు సూచన మేరకు అభ్యర్థులకు అదనంగా 7 మార్కులు కలిపేందుకు బోర్డు అంగీకరించింది. దీంతో మరింత మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించనున్నారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నెంబర్లతోనే లాగిన్ అవ్వొచ్చు. ఫిబ్రవరి 1-5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.