Group-2 Syllabus Changes : గ్రూప్-2 సిలబస్ లో మార్పులు.. పేపర్-2, 3లో కొత్త అంశాలు

టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్ లో కొన్ని మార్పులు చేసింది. పేపర్-2, పేపర్-3లో కొత్త అంశాలను చేర్చింది. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అదనంగా పలు అంశాలను జత చేసింది.

Group-2 Syllabus Changes : గ్రూప్-2 సిలబస్ లో మార్పులు.. పేపర్-2, 3లో కొత్త అంశాలు

TSPSC

Group-2 Syllabus Changes : టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్ లో కొన్ని మార్పులు చేసింది. పేపర్-2, పేపర్-3లో కొత్త అంశాలను చేర్చింది. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అదనంగా పలు అంశాలను జత చేసింది. ఇటీవలే టీఎస్ పీఎస్సీ 783 పోస్టులతో గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

పేపర్-2 లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1,4లో ఎలాంటి మార్పులు చేయలేదు. పేపర్-2 రెండో సెక్షన్ లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలను సిలబస్ లో చేర్చారు.

Welfare Hostels 581 Vacants : నిరుద్యోగులకు టీసర్కార్ మరో గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టళ్లలో 581 ఉద్యోగాలకు నోటిఫికేషన్

మూడో సెక్షన్ లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం-మహిళలు అనే అంశాన్ని చేర్చారు. పేపర్-3లోని ఒకటో సెక్షన్ లో డెమోగ్రసీ (జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్, నీతి అయోగ్-పబ్లిక్ ఫైనాన్స్ జత చేశారు.

రెండో సెక్షన్ లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితోపాటు జనాభా- మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవారంగాలు, రాష్ట్ర ఫైనాన్స్, బడ్జెట్, పాలసీలు చేర్చారు. మూడో సెక్షన్ లో అభివృద్ధి-అండర్ డెవలప్ మెంట్, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం-సుస్థిర అభివృద్ధిని కొత్తగా చేర్చారు.