TSRTC : ఇక ఎన్నిసార్లు అయినా బస్సులో ప్రయాణించొచ్చు.. టీఎస్‌ఆర్టీసీ కొత్త రూట్ పాస్

TSRTC : స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది.

TSRTC : ఇక ఎన్నిసార్లు అయినా బస్సులో ప్రయాణించొచ్చు.. టీఎస్‌ఆర్టీసీ కొత్త రూట్ పాస్

TSRTC (Photo : Google)

TSRTC – General Route Pass : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కొత్త రూట్ పాస్ తీసుకొచ్చింది. అదే ‘జనరల్ రూట్ పాస్’. ప్రస్తుతం టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు ఈ పాస్ వర్తిస్తుంది. మే 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

దీని వ్యవధి నెల రోజులు. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ధర రూ.600. మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ ధర రూ.1000. ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాలి. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైనా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. అంతేకాదు హాలిడేస్ రోజులతో పాటు సండే రోజున కూడా ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.(TSRTC)

Also Read..Telangana : నల్లగొండ అభివృద్ది కోసం నా చివరి రక్తపుబొట్టు వరకు పాటుపడుతా : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

హైదరాబాద్ లో ప్రయాణికులకు జనరల్ బస్ టికెట్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్ పాస్ కు రూ.1150, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కు రూ.1300గా ధర ఉంది. ఈ పాస్ దారులు సిటీ సబర్బన్ పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అయితే, దూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్ లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని తేలింది. దాంతో తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్ ను టీఎస్ఆర్టీసీ రూపొందించింది.

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్ ను సంస్థ ప్రారంభించిందని ఆయన తెలిపారు.(TSRTC)

Also Read..Konda Vishweshwar Reddy : ఫేక్ ఓట్లను నిర్మూలించడంలో ఈసీ విఫలం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్

రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్ పాస్ లను ఇస్తున్నాం అని, తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు ఇవ్వాలని సంస్థ నిర్ణయించిందన్నారు. సాధారణంగా ఆర్డీనరీ రూట్ పాస్ కు రూ.800, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1200 గా ఉంటుందన్నారు. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి.. సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ ను రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ రూ.1000కే అందిస్తున్నాం అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనర్ చెప్పారు.

ఈ పాస్ కు సంబంధించిన రూట్ల వివరాల కోసం http://tsrtc.telangana.gov.in, https://online.tsrtcpass.in వెబ్ సైట్లను సంప్రదించాలని వారు సూచించారు.