YS Sharmila : షర్మిల టూర్ లో ట్విస్ట్…ముఖం చాటేసిన నీలకంఠసాయి

YS Sharmila : షర్మిల టూర్ లో ట్విస్ట్…ముఖం చాటేసిన నీలకంఠసాయి

Ys Sharmila

YS Sharmila : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ఈరోజు ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్గోండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజక వర్గంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఆమె పర్యటన కొనసాగిస్తున్నారు. ముందుగా మిర్యాలగూడ చేరుకున్న షర్మిల తన అనుచరుడు, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి ఇంట్లో అల్పాహారం చేసారు.

అనంతరం… ఇటీవల కరోనాతో మృతిచెందిన తెలంగాణ రాష్ట్ర వైయస్ఆర్సీపీ పార్టీ సెక్రెటరీ ఎండి సలీం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య పిల్లలను పరామర్శించి వారికి అండగా ఉంటానని హమీ ఇచ్చారు. సలీం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

అక్కడి నుంచి బయలుదేరి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో  ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి నీలకంఠం సాయిని, వారి కుటుంబన్ని పరామర్శించడానికి వెళ్ళారు. కాగా … షర్మిల వచ్చేసమయానికి సాయి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

చుట్టుపక్కల వారిని సాయి గురించి ఆరా తీయగా తండ్రితో కలిసి కోదాడ ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. నిన్న రాత్రి అధికార పార్టీ నేతలు, పోలీసులు నీలకంఠ సాయి ఇంటికి వచ్చి ఇంట్లో లేకుండా వెళ్లిపోవాలని చెప్పినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేతల ఒత్తిడితోనే సాయు కుటుంబం ఇల్లువదిలి వెళ్లినట్లు షర్మిల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఆమె హుజుర్ నగర్ కి బయల్దేరి వెళ్ళారు. అక్కడ లంచ్ చేసుకున్న అనంతరం చింతలపాలెం మండలం దొండపాడు లో సీనియర్ నాయకుడు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.