KFC : చికెన్ పై కంప్లెయింట్..! అసలేం జరిగిందంటే…

కేఎఫ్‌సీ చికెన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాగా ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు KFC చికెన్ ఎంతో ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. టేస్ట్ లోనే కాదు కస్టమర్ కి ఇచ్చే సర్వీస్ విషయంలోనూ కేఎఫ్ సీకి మంచి పేరుంది.

KFC : చికెన్ పై కంప్లెయింట్..! అసలేం జరిగిందంటే…

Kfc Chicken

KFC Chicken : కేఎఫ్‌సీ చికెన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాగా ఫేమస్. పిల్లల నుంచి పెద్దల వరకు KFC చికెన్ ఎంతో ఇష్టపడతారు. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. టేస్ట్ లోనే కాదు కస్టమర్ కి ఇచ్చే సర్వీస్ విషయంలోనూ కేఎఫ్ సీకి మంచి పేరుంది. చికెన్‌.. రుచిగా లేదని ఫిర్యాదు చేసినా సరిగా ఉడకలేదని చెప్పినా.. కంపెనీ వెంటనే స్పందిస్తుంది. కస్టమర్ కి సారీ చెప్పి.. మరికొన్ని పీస్‌లను ఇస్తుంటుంది. అందుకే కేఎఫ్‌సీకి అంత ఆదరణ.

అయితే.. అలాంటి కేఎఫ్‌సీ నుంచి తాజాగా ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సిబ్బంది వడ్డించారు. పైగా నిర్లక్ష్యంగానూ వ్యవహరించారు. ఈ విషయాన్ని కస్టమర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ఫిర్యాదు చేసినా.. సిబ్బంది కనీసం పట్టించుకోలేదని వాపోయాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఈ ఘటన జరిగింది.

సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. చికెన్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. కేఎఫ్‌సీ సిబ్బంది అతడికి సర్వ్ చేశారు. అయితే అతడికి ఇచ్చిన చికెన్ బాగోలేదు. సరిగా ఉడకని చికెన్‌ పీస్‌లను సర్వ్‌ చేశారు. చికెన్ ఇలా ఉందేంటి అని సాయితేజ సిబ్బందిని అడిగాడు. దీని గురించి వారికి ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.

దీంతో అతడీ విషయాన్ని ట్విట్టర్‌ లో పోస్టు చేశాడు. తన గోడు వెళ్లబోసుకున్నాడు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్‌ నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు. తాను డిస్పాయింట్ అయినట్టు తెలిపారు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయన్నాడు. దీనిపై పరిశీలన చేయాలని కోరుతూ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ను ట్యాగ్‌ చేశాడు.