Suryapet : అమానుషం.. మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం కొట్టిన గ్రామస్తులు

సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానవీయ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న మహిళాపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు మృతుడి కుటుంబ సభ్యులు.

Suryapet : అమానుషం.. మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం కొట్టిన గ్రామస్తులు

Suryapet

Suryapet :  సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానవీయ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న మహిళాపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు మృతుడి కుటుంబ సభ్యులు. అందరు చూస్తుండగా ఆ మహిళను వివస్త్రను చేసి కళ్ళలో కారం చల్లి విధుల్లో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. దాడి చేసినవారిలో పలువురు మహిళలు ఉన్నారు.

ఆదివారం జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజు నాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యాడు. శంకర్ నాయక్ కుటుంబంతో పాతకక్షలు ఉన్న ఓ మహిళా ఈ హత్యకేసులో నిందితురాలిగా ఉంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సదరు మహిళకు జైలు శిక్ష విధించింది.

ఇటీవల బెయిల్ పై విడుదలైన మహిళ సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటుంది. శనివారం రాజు నాయక్ తండాలో బంధువు మృతి చెందటంతో అక్కడికి వెళ్ళింది. ఈమెను చూసిన వెంటనే శంకర్ నాయక్ బంధువులు దాడికి దిగారు. ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి వివస్త్రను చేసి కళ్ళలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గంటసేపు ఈ అరాచకం కొనసాగినా స్థానికులు అడ్డుకోకుండా చోద్యం చూశారు.

ఇక తనను తాను కాపాడుకునేందుకు మహిళ ఎంపీటీసీ శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. ఎంపీటీసీ రక్షణ కల్పించిన కాసేపటికే పోలీసులు తండాకు వెళ్లారు. పోలీసులు బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సర్పంచ్, గ్రామ పెద్దలు చూసి కూడా తనను కాపాడలేదని వాపోయారు బాధిత మహిళ. ఇక ప్రస్తుతం ఆమె సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.