ప్రశాంతంగా దుబ్బాక పోలింగ్, 55శాతం దాటిన ఓటింగ్ శాతం

  • Published By: naveen ,Published On : November 3, 2020 / 02:27 PM IST
ప్రశాంతంగా దుబ్బాక పోలింగ్, 55శాతం దాటిన ఓటింగ్ శాతం

dubbaka by poll percentage : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం(నవంబర్ 3,2020) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.