దుబ్బాకలో మ.3గంటలకే 70శాతం దాటిన పోలింగ్
dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.