వరంగల్ లో 9 హత్యల కేసుపై తుది తీర్పు, నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 09:12 AM IST
వరంగల్ లో 9 హత్యల కేసుపై తుది తీర్పు, నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష

Warangal Migrants Death Mystery : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసుపై తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. మే 21వ తేదీన గొర్రెకుంట సాయిదత్త గన్ని బ్యాగ్ కంపెనీలో 9 మందికి మత్తు ఇచ్చి సజీవంగా బావిలో పడేసిన సంగతి తెలిసిందే. నిందితుడిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నెల రోజుల్లో కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు.



తొమ్మిది మంది వలస కూలీల మృతి కేసులో బూస్రా ప్రియుడు సంజయ్‌కుమార్‌ యాదవే.. హత్యల కీలక సూత్రధారిగా నిర్ధారణ అయింది. తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక… ఈడ్చుకెళ్లి బావిలో పడేసినట్లు తేలింది.



https://10tv.in/rajendra-nagar-doctor-hussein-kidnap-mystery/
విడాకులు తీసుకున్న బుస్రా : –
స్నేహితులతో కలిసి సంజయ్‌కుమార్‌ యాదవ్ సామూహిక హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడు సంజయ్‌ కుమార్ యాదవ్‌‌… మక్సూద్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. గన్నీ బ్యాగులు కుడుతూ మక్సూద్‌ వద్ద పని చేసేవాడు. అలా మక్సూద్‌ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ కుటుంబసభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే మక్సూద్‌ కూతురు బుస్రా.. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.



మరొకరితో సన్నిహితంగా ఉంటోందంటూ : –
బుస్రా ఒంటరిగా ఉంటుందని గ్రహించిన సంజయ్‌కుమార్‌.. ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ఆమెకు గిఫ్ట్‌లు కొనిచ్చేవాడు. ఆర్థికంగా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు సాయపడేవాడు. ఇలా రానురాను ఆ కుటుంబంలో ఒకడిలా కలిసిపోయాడు. సీన్‌కట్‌ చేస్తే… ఇటీవల బుస్రా… యాకూబ్‌ పాషాతో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో తనకు దక్కాల్సిన బుస్రా… మరొకరికి సన్నిహితంగా ఉంటోందంటూ రగిలిపోయాడు.



డబ్బులు ఇవ్వాలంటూ బుస్రాపై వత్తిడి : –
ఆమెను దక్కించుకునేందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టిన సంజయ్‌కుమార్‌ యాదవ్‌… ఆ డబ్బంతా తిరిగి రాబట్టాలనుకున్నాడు. బుస్రాపై ఒత్తిడి తెచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో డబ్బు కోసం మరింత టార్చర్‌ చేశాడు. తన డబ్బు తనకిచ్చేస్తే బీహార్‌ వెళ్లిపోతానని చెప్పాడు. సంజయ్‌ టార్చర్‌ రోజురోజుకు పెరుగుతుండటంతో… విషయాన్ని తండ్రికి చెప్పింది. అటు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మృతుడు షకీల్‌ కుటుంబానికి కూడా చేరవేసింది.



సంజయ్ కు మందలింపులు : –
దీంతో ఇటు మక్సూద్‌, అటు షకీల్‌… సంజయ్‌కుమార్‌ను మందలించారు. అయినప్పటికీ సంజయ్‌ తీరు మార్చుకోలేదు. ఇక చనిపోయిన ఇద్దరు బీహార్‌ యువకులు శ్యామ్, రామ్‌లకు మక్సూద్‌ కుటుంబంతో పరిచయం ఉంది. దీంతో ఆ ఇద్దరికి కూడా సంజయ్‌కుమార్‌ వేధిస్తున్నాడంటూ బుస్రా చెప్పింది. వాళ్లు కూడా సంజయ్‌కుమార్‌ను గట్టిగా మందలించారు.



మర్డర్స్ కు ప్లాన్ : –
ఓ వైపు బుస్రా మరొకరికి సన్నిహితంగా ఉంటుండటం, ఇంకోవైపు మక్సూద్‌, షకీల్‌, ఇద్దరు బీహారీ యువకులు మందలించడంతో.. సంజయ్‌కుమార్‌ రాక్షసుడిగా మారాడు. మక్సూద్‌ ఫ్యామిలీతో పాటు, షకీల్‌, ఇద్దరు బీహారీ యువకులపై పగ పెంచుకున్నాడు. అందరినీ అంతం చేయాలనుకున్నాడు.



బుధవారం ముహూర్తం : –
తన పుట్టినరోజు అంటూ అందరినీ నమ్మించాడు. 2020, మే20వ తేదీ బుధవారాన్ని ముహుర్తంగా ఎంచుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో… టాటా ఏస్‌ వాహనంతో గోడౌన్‌కు వచ్చాడు. అప్పటికే ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ ఏర్పాటు చేశాడు. చివరిక్షణం వరకు కూడా తన మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.



అనంతరం తన ప్లాన్‌ అమలు చేశాడు. ఆ ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలను కలిపాడు. ఎవరెవరిని అయితే అంతం చేయాలనుకున్నాడో.. ప్లాన్‌ ప్రకారం వాళ్లకే వాటిని అందజేశాడు. అనంతరం స్రృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేశాడు. దీంతో తొమ్మిది మందిది హత్యేనని తేలింది.