దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను కొట్టిన వాచ్మెన్లు..ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యువకుడు మృతి చెందాడు.
మృతి చెందిన షాదుల్లా అనే యువకుడు అర్మూర్కు చెందినవాడు. వాచ్ మెన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో వాచ్మెన్లతో పాటు ఇంకెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.