రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన డాక్టర్లు..లబోదిబోమన్న పేషెంట్

  • Published By: nagamani ,Published On : October 15, 2020 / 01:05 PM IST
రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్టేసిన డాక్టర్లు..లబోదిబోమన్న పేషెంట్

Worangal MGM Hospital ; వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం మరో సారి బైటపడింది. ఓ రోగికి ఆపరేషన్ చేసి ఓ కత్తెరను కడుపులోనే పెట్టి కుట్టేశారు. ఆ సంగతి మర్చిపోయారు. కొన్ని రోజులు ఏమీ తెలియలేదు.



కానీ సదరు పేషెంట్ కు కొన్ని రోజులకు తీవ్రమైన కడుపు నొప్పిరావటంతో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించగా అతని కడుపులో ఓ కత్తెర ఉన్నట్లుగా తేలింది. దీంతో వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.


తనకు జరిగిన అన్యాయానికి ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్ల దగ్గరకెళ్లిన బాదితుడు నిలదీయగా..గుట్టుగా ఆపరేషన్ చేస్తామని చెప్పి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయటంతో ఈ విషయం కాస్తా బైటకు తెలిసిపోయింది. ఈ విషయం తెలిసిన వారంతా ప్రజల ఆరోగ్యంపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.


వివారాల్లోకి వెళితే..బెల్లంపల్లిలోని శాంతిగనికి చెందిన రాజు కొన్ని రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ సమయంలో డాక్టర్లు అతని కడపులో కత్తెరను మర్చిపోయి కుట్లు వేసేశారు.



కొన్ని రోజులకు అతడికి కడుపునొప్పి రావడంతో మరోసారి ఓ ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్లగా వారు స్కానింగ్ తీయించగా ఈ విషయం బైటపడింది. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బైటపడ్డాడని అదే ఏదన్నా జరగరానిది జరిగిదే ప్రాణాలే పోయేవి కదా..ఆపరేషన్ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

https://youtu.be/mauerJgBjZw