Y S Sharmila : రంగారెడ్డి జిల్లాకు రానున్న షర్మిల

వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని ఆమె పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Y S Sharmila : రంగారెడ్డి జిల్లాకు రానున్న షర్మిల

Sharmila

Y S Sharmila To Tour Rangareddy : వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని ఆమె పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతర నేతలతో షర్మిల సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. జూలై 8వ తేదీన వై.యస్.ఆర్.టి.పి(YSRTP) పార్టీ పేరును ఆమె లాంఛనంగా ప్రకటించనున్నారని సమాచారం.

జూలై 8న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజు పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో మళ్ళీ తీసుకురావడం కోసం, వైఎస్ ఆశయాలు, ఆలోచనలు ప్రతిబింబించేలా, వైఎస్ అందించిన సంక్షేమం .. ప్రతి ఇంటికి మళ్ళీ చేరేలా “YSR తెలంగాణ” పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు షర్మిల ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా..రంగారెడ్డి జిల్లాలో షర్మిల పర్యటించబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : Vishaka KGH: కరోనాతో వెంటిలేటర్‌పై గర్భిణి.. సిజేరియన్ డెలివరీ చేసిన వైద్యులు!