Warangal : అత్తింటి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

అత్తింటివారి వేధింపు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Warangal : అత్తింటి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

Warangal (2)

Warangal : నాచావుకు నా భార్య, ఆమెకుటుంబ సభ్యులే కారణం…నన్నునిత్యం అత్తింటివారు వేధిస్తున్నారు… భార్యతో సహా ఆమె కుటుంబ సభ్యులంతా మానసికంగా హింసిస్తున్నారు. వారి హింస భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని వాయిస్ రికార్డు చేసి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్ (25) కు భార్య, ఆమె కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వారి వేధింపులు భరించలేక ఈనెల 19న బంధంపల్లికి చేరుకున్న ప్రదీప్ తన ఆత్మహత్యగురించి వాయిస్ రికార్డ్ చేసి తండ్రి నగేష్ కు పంపించి గడ్డిమందు తాగాడు. వాయిస్ మెసేజ్ విని అక్కడకు చేరుకున్న బంధువులు కుటుంబ సభ్యులు ప్రదీప్‌ను హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి చికిత్స పొందూతూశనివారం ప్రదీప కన్నుమూశాడు. మృతుని తండ్రి నగేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.