young woman Raped : పర్యాటక ప్రాంతానికెళ్లిన యువజంట : యువకుడిని కొట్టి యువతిపై అత్యాచారం
ములుగు జిల్లాలో దారుణం జరిగింది. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
young woman kidnap and Raped : ములుగు జిల్లాలో దారుణం జరిగింది. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. పర్యాటక ప్రాంతం చూసేందుకు ఓ యువ జంట బైక్పై వెళ్లింది. దీనిని గమనించిన ఇద్దరు వ్యక్తులు యువకుడిని బెదిరించి ఫోన్ లాక్కోవడమే కాకుండా యువతిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం దాడికి పాల్పడ్డారు. యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఇంటి వద్ద వదలిపెట్టారు. యువతి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని పర్యాటక స్థలమైన బ్లాక్బెర్రీ ఐలాండ్ అటవీ ప్రాంతానికి గతనెల 30న ఓ జంట బైక్పై వెళ్లారు. వీరిని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగామ ఆనందరావు అటకాయించి యువకుడిని కొట్టి సెల్ఫోన్ లాక్కున్నారు. బైక్ టైర్లలో గాలి కూడా తీసేశారు.
యువతిని బలవంతంగా బైక్పై ఎక్కించుకుని మణుగూరు తీసుకెళ్లారు. సాత్విక్ అనే యువకుడు యువతిని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనికి ఆనందరావు సహకరించాడు. యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆనందరావు ఆమెను బైక్పై స్వగ్రామానికి తీసుకెళ్లి వదిలేశాడు.
అత్యాచారం వీడియో తీశామని, విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలు షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. చివరకు ఆమె స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంక టేశ్వరరావు రంగంలోకి దిగి, నిందితులను కాటా పూర్ క్రాస్ వద్ద శనివారం ఉదయం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.