YSR : వైఎస్ వర్ధంతి..విజయమ్మ ప్రత్యేక సమావేశం..షర్మిల కోసమేనా ?

వైఎస్‌ఆర్‌తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ  ఫోన్ చేసి  మీటింగ్‌కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

YSR : వైఎస్ వర్ధంతి..విజయమ్మ ప్రత్యేక సమావేశం..షర్మిల కోసమేనా ?

Sharmila

YS Vijayamma : వైఎస్‌ఆర్‌తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ  ఫోన్ చేసి  మీటింగ్‌కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలను హైదరాబాద్ మీటింగ్‌కి రావాలని కబురు పంపడం హట్ టాపిక్‌గా మారింది.

Read More : Texas Mom : బడికి పంపుతున్నా..క్షమించండి అంటూ పిల్లలకు తల్లి లేఖ

ఈ సమావేశానికి వైఎస్‌ అంతరాత్మగా చెప్పుకునే కెవిపి రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ పీసీసీ చీఫ్‌ డి శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరికొంత మందిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరికి… అలాగే ముఖ్యనాయకులకూ.. విజయమ్మ నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. సుమారు పది నుంచి పదిహేను మంది.. వైఎస్‌ సన్నిహితులతో హైదరాబాదులోని ఓ  హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read More : Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో షూటర్ అవని లేఖారాకు గోల్డ్ మెడల్..

అయితే వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఈ మీటింగ్‌కు వైఎస్సార్‌టీపీ ముఖ్య నాయకులకు మాత్రం ఎలాంటి ఆహ్వానం రానట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్‌టీపీలో ఉన్న నాయకులు కూడా గతంలో వైఎస్ఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నవారున్నారు. అయితే వీరి ప్రమేయం లేకుండా విజయమ్మ మీటింగ్ ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుపట్టడం లేదు.

Read More : India : ఆసియా జూ.బాక్సింగ్, పంచ్‌‌లతో అదరగొట్టారు..నాలుగు స్వర్ణాలు

విజయమ్మ ఏర్పాటు చేసే సమావేశానికి.. వైఎస్సార్ కుటుంబ సభ్యులు, వైఎస్‌ సానుభూతిపరులను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి వైఎస్ విజయమ్మ, వైఎస్‌ఆర్‌ సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేయడం వెనుక మర్మమేంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.