YSRTP: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం.. పోస్టర్ విడుదల

తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన ఏర్పాట్లను షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు.

YSRTP: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం.. పోస్టర్ విడుదల

Ys Sharmila All Set To Launch Her New Political Party Poster Released

YS Sharmila: తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన ఏర్పాట్లను షర్మిల ముఖ్య అనుచరులు చేస్తున్నారు. కొండ రాఘవ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమ వాల్ పోస్టర్‌ను షర్మిల అనుచరులు ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఒక్కో జిల్లా నుంచి 2వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది.

ఇన్విటేషన్ ఉన్నవారినే.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి అనుమతించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి అందరూ రావాల్సిందేనని, వారి ముందు మాత్రమే ఆవిష్కరణ చేయాలని షర్మిల నిర్ణయించారు. కార్యక్రమంలో స్క్రీన్లు వద్దని అనుచరులకు సూచించారు. అంతేకాదు పార్టీ కండువాలు కూడా సిద్ధం చేశారు. జూలై 9న నుంచి గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు కొండ రాఘవరెడ్డి చెప్పారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. జూలై 8న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఉదయం పదిన్నరకి హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ షర్మిల నివాళులర్పిస్తారు.

తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు ఉండగా.. మిగిలిన 20 శాతం నీలి రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న పార్టీని ప్రారంభించనున్నారు షర్మిల.

ఇక ఇప్పటికే షర్మిల తన పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కుమార్తె ప్రియను ఎంచుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో ప్రియ కీలకంగా వ్యవహరించారు. ఈ నెల 8న ప్రకటించనున్న షర్మిల కొత్త పార్టీతో పాటు సోషల్‌ మీడియాకు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.