YS Sharmila : పదేళ్లలో కేసీఆర్ సాధించింది.. అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు : వైఎస్ షర్మిల

పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.

YS Sharmila : పదేళ్లలో కేసీఆర్ సాధించింది.. అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు : వైఎస్ షర్మిల

YS Sharmila (3)

YS Sharmila – KCR : సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దొర ప్రసంగమంతా అబద్ధాలమయమని, అరచేతిలో వైకుంఠం చూపించారని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు అని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందన్నారు.

సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో దొర చేతిలో పెడితే.. రాష్ట్రాన్ని అప్పులపాలు, అధోగతి పాలు జేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎడమకాలు చెప్పుకింద తొక్కిపెట్టాడని పేర్కొన్నారు.
సర్వతోముఖాభివృద్ధి, ఉజ్వల ప్రగతి అంటే ఏంటి దొరా? నిధులు, నీళ్ళు, నియామకాలను మంటగలపడమా? రెండు సార్లు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమా? అని ప్రశ్నించారు. తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే.. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లు అని నిలదీశారు.

Andra Pradesh : ఏపీలో మొదలైన ఎన్నికల వేడి .. పర్యటనలతో పార్టీ అధినేతల కసరత్తులు

2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లు అని అడిగారు. రెప్ప పాటు కరెంట్ కోతలు లేవని చెప్పి.. డిస్కంలను రూ. 26వేల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టినట్లు అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి.. 9గంటలు కూడా ఇవ్వకపోవడం విద్యుత్ విజయమా అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీజం పడితే.. కొత్తగా మీరు సాధించింది ఏమిటని ప్రశ్నించారు.

భూపాలపల్లి ప్లాంట్ వైఎస్సాఆర్ ప్రారంభించినదే కదా..? జైపూర్, భద్రాద్రి ప్లాంట్లకు బీజం వేసింది కూడా ఆ మహానేతనే కదా? అని తెలిపారు. ఐదేళ్లలోనే మహానేత వైఎస్సాఆర్ 40 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తే.. తొమ్మిదేళ్లలో లక్ష ఇళ్లు కట్టలేని నువ్వు.. ఇళ్లు లేని 36లక్షల మంది ఆత్మగౌరవాన్ని కాపాడినట్లా అని అన్నారు. 1.30 లక్షల మందికే ఈ దఫా దళితబంధు ఇస్తే.. మిగతా 18 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం ఎక్కడ పోయినట్లని నిలదీశారు.

MLC Kavitha: సీఎం కేసీఆర్ వల్లే ఇవి సాధ్యమయ్యాయి: ఎమ్మెల్సీ కవిత

జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఆనాడే 30 లక్షల ఎకరాలకు తడిపిన ఘనత వైఎస్సార్ ది అయితే.. డిజైన్ మార్చి రూ.లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు.
పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.

పంట పరిహారం ఇస్తా అంటే రైతులే వద్దని చెప్పారట అని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో 2.20 కోట్ల ఎకరాలకు సాగుబడి పెరిగితే.. వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి నువ్వే కదా అని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. పత్తి వేయించి రైతుల్ని నిండా ముంచింది నిజం కాదా? అని నిలదీశారు.
కేజీ టూ పీజీ లేదు, ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.5వేల కోట్లు బకాయిలు ఇవ్వలేదని విమర్శించారు.

uttar pradesh : గంటల తరబడి చెవుల్లోనే ఇయర్ బడ్స్.. వినికిడి శక్తి కోల్పోయిన యువకుడు

కనీసం బాత్ రూంలు కట్టలేనోడు.. విద్యారంగం అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆకాంక్ష తెలంగాణ అయితే.. ఇంటికో ఉద్యోగం ఎక్కడ పాయె? అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన ఉద్యోగాలు ఎక్కడ? 10 ఏళ్లుగా 65 వేల ఉద్యోగాలు ఇస్తే.. 50 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరిగినట్లేనా..? అని ప్రశ్నించారు.

‘మెడికల్ సీట్లు పెంచినమని చెప్పి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో బాలింతలను పొట్టన పెట్టుకోవడమే మీ వైద్య వ్యవస్థ అభివృద్ధా?  తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులైతే.. మీరు ఆదుకున్నది ఎంతమందిని?’ అని అడిగారు. అమరవీరుల పేర్లు కూడా లేకుండా చేశారు కదా? 10 ఏళ్లుగా చేసింది లేదు కానీ ఎన్నికల్లో ఓట్ల కోసం పోడు పట్టాలు, గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడని పేర్కొన్నారు.

Harish Rao: “హ్యాపీ బర్త్ డే బావా” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. ఓటమి ఎరుగని నేత హరీశ్ రావు

సంపద పెంచడం – ప్రజలకు పంచడం కాదు.. సంపద వెతకడం – అమ్మడం, దొర ఖజానాకు చేర్చడం, దోచుకున్న డబ్బుతో దేశ రాజకీయాలు చేయడం.. ఇదే నవ తెలంగాణ, ఇదే తెలంగాణ మోడల్ అని ఎద్దేవా చేశారు. ఉద్యమ తెలంగాణ – ఉజ్వల తెలంగాణ కాలేదన్నారు. ఉద్యమ తెలంగాణ మళ్ళీ ఉద్యమాల తెలంగాణగానే మారిందని చెప్పారు. దొర నిరంకుశ పాలన అంతానికి మరో దఫా ఉద్యమం సాగించే సమయం వచ్చిందన్నారు. దొరల పాలన అంతమైతేనే సంక్షేమ, స్వయంసమృద్ధి తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.