YS Sharmila: కేసీఆర్ అండ్ కో కన్నా దేశంలో దళారి ఎవరు? మీ దళారి పాలనను బొందపెట్టే గడియలు దగ్గరపడ్డాయి

కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఐదు లక్షలు, దళితబంధులో మూడు లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు మూడు లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులు అని షర్మిల అన్నారు.

YS Sharmila: కేసీఆర్ అండ్ కో కన్నా దేశంలో దళారి ఎవరు? మీ దళారి పాలనను బొందపెట్టే గడియలు దగ్గరపడ్డాయి

YS Sharmila

YS Sharmila: దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉంది అంటూ సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరు? సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరు? మూడు కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఉద్యమ ఆకాంక్షను నమ్మి మీ చేతుల్లో పెడితే నట్టేట ముంచిన దోపిడీ దొంగలు మీరే కదా అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీళ్లు అని చెప్పి ఫామ్ హౌజ్‌కి, నిధులని చెప్పి మీ ఖజానాకు, ఉద్యోగాలు అని చెప్పి మీ కుటుంబానికి ఎత్తుకుపోయిన మోసగాళ్లు మీరు కాదా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు.

YS Sharmila : కవిత అరెస్ట్ ఎప్పుడు? కారు, కమలం రెండూ ఒక్కటే..!- వైఎస్ షర్మిల

బంగారు తునక రాష్ట్రాన్ని ఐదు లక్షలకోట్ల అప్పుల కుప్ప చేసి ఆ సొమ్ముతో దేశ రాజకీయాలు చేసే మీరే ఈ శతాబ్దపు అసలైన దళారులు అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బడి నుంచి సాగుబడి వరకు అన్ని ప్రాజెక్టులపై లక్ష కోట్ల కమీషన్లు తిన్న దోపిడీ దారులు మీరే. పార్టీ కార్యాలయాలకు, అయినోళ్లకు అగ్గువకే 30వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టిన మీ పాలన దళారి పాలన కాదా? దొర గుడిని మింగితే ఆయన ఎమ్మెల్యేలు లింగాలనే మింగే దళారులు అంటూ షర్మిల విమర్శించారు.

YS Sharmila : పదేళ్లలో కేసీఆర్ సాధించింది.. అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు : వైఎస్ షర్మిల

కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఐదు లక్షలు, దళితబంధులో మూడు లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు మూడు లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అతి పెద్ద దళారులు అని షర్మిల అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకుని తిరుగుతూ.. ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించి, పూటకో మాట, గడికో హామీ.. అంటూ మస్త్ మాటలు చెప్పే అసలైన పగటి వేషగాడు కేసీఆర్ అంటూ షర్మిల విమర్శించారు.

CM KCR : ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్

ఒకప్పుడు గంజి కేంద్రాలు ఏమో కానీ మీ నియంత పాలనలో గల్లికొక లిక్కర్ కేంద్రాలే మిగిలినయ్. రైతు రాజ్యం ఉందని దొరల రాజ్యం నడుపుతూ, వెలుగు జిలుగులు వచ్చాయని.. అంధకారంలోకి నెట్టిన మీ దళారి పాలనను బొందపెట్టే గడియలు దగ్గరపడ్డాయి అంటూ షర్మిల సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.