YS Sharmila tweet: తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన TSPSC బోర్డు నిర్వాకమిది.. షర్మిల సంచలన ట్వీట్

దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila tweet: తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన TSPSC బోర్డు నిర్వాకమిది.. షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో లక్షలాది మంది యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా .. సర్వర్లు హ్యాకింగ్, క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్, హైటెక్ మాస్ కాపీయింగ్.. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన టీఎస్పీఎస్సీ బోర్డు నిర్వాకమిది అంటూ పేర్కొన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా గవర్పర్ తమిళిసై స్పందించాలని షర్మిల ట్విటర్‌లో కోరారు.

West Bengal: కాంగ్రెస్‭కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే

ఎగ్జామ్ హాల్‌లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బగ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల వద్ద కేసీఆర్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? 24గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే టీఎస్పీఎస్సీ నిర్వాకం సాధ్యమైందా అని షర్మిల ప్రశ్నించారు. లక్షలాది మంది యువత అప్పులు చేసి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే కేసీఆర్ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చిన బహుమానం ఇదేనా? అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivasa Rao: మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది

చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే.. కేసీఆర్, TSPSC బోర్డు సిగ్గుతో తలదించుకోవాలి కదా అంటూ షర్మిల ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ఐటీ డిపార్ట్‌మెంట్ మొత్తం అవినీతిపాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థత కారమని, ఆ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కొలువుల కోసం నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకుంటే.. అదే నిరుద్యోగుల నోట్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని, లక్షలాది యువత ఆకాంక్షలను బొందపెట్టారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు అవినీతి, అక్రమాలు గ్రామాలకు పాకి ఖండాలు దాటినా చర్యలు ఎందుకు లేవో అర్థం కావడం లేదని అన్నారు.

DK Shivakumar – YS Sharmila : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ షర్మిల భేటీ.. తెలంగాణలో పొత్తులకు సంకేతమా..?

దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారు. సిట్ అధికారులకు గడీ బయట ఉన్న దొంగలు దొరుకుతున్నారు. కానీ గడీ లోపల ఉన్న అసలు దొంగలు దొరకడం లేదా అంటూ షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ స్పందించాలని షర్మిల కోరారు. మీకున్న అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతికి సిఫారసు చేసి, టీఎస్పీఎస్సీ బోర్డును పునరుద్ధరించాలని కోరుతున్నానని షర్మిల తన ట్వీట్‌లో పేర్కొన్నారు.