YS Sharmila : నల్గొండకు రానున్న షర్మిల

నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

YS Sharmila : నల్గొండకు రానున్న షర్మిల

Nalgonda Sharmila

YS Sharmila Nalgonda District : వైఎస్ షర్మిల జిల్లాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటులో ఫుల్ స్పీడులో ఉన్న షర్మిల…ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా..వివిధ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె..రైతులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

తాజాగా నల్గొండ జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు డేట్ కూడా కన్ఫామ్ చేశారు. 2021, జూన్ 15వ తేదీన నల్గొండకు వెళ్లనున్నారు. కరోనా వైరస్ తో చనిపోయిన గుణ్ణం నాగిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. నాగిరెడ్డి విషయానికి వస్తే..ఆయన వైఎస్ఆర్ అభిమాని. అంతేగాకుండా..మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్.

రాజన్న రాజ్యం మళ్లీ రావాలని షర్మిల చెబుతూ వస్తున్నారు. లోటస్ పాండ్ లో పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతరులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే పార్టీ ప్రకటనపై సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును ప్రాథమికంగా ఖరారు చేశారు. త్వరలో ఎన్నికల కమిషన్ కు షర్మిల టీమ్ దరఖాస్తు చేయనుంది. పార్టీ పేరును త్వరలో ఈసీకి దరఖాస్తు చేసే యోచనలో ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?..ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తున్నారు.

Read More : Tamil Nadu : రాజీవ్ గాంధీ హత్య కేసు, దోషులందరినీ విడుదల చేయాలి