గమనిక : 18 పాసింజర్  రైళ్లు రద్దు

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 05:17 AM IST
గమనిక : 18 పాసింజర్  రైళ్లు రద్దు

విజయవాడ : కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే యార్డు వద్ద నిర్వహణ పనులు  చేపడుతుండడంతో విజయవాడ, తిరుపతి, కాచిగూడ తదితర స్టేషన్ల నుంచి రాకపోకలు జరిపే పలు పాసింజరు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ప్రకటించారు. రైల్వే యార్డు వద్ద నిర్వహణ పను చేపడుతుండడంతో ఈ రద్దు అనివార్యమైందని..ఈ క్రమంలో మొత్తం 18 పాసింజరు రైళ్లను, 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పూర్తిగా, ఎనిమిదింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
 

దీంతో విజయవాడ-గూడూరు, విజయవాడ-హుబ్బళి, విజయవాడ-బెంగళూరు, విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-చెన్నై, గూడూరు-తిరుపతి, గూడూరు-రేణిగుంట, గూడూరు-విజయవాడ, తిరుపతి-గుంటూరు, చెన్నై-గూడూరు, తిరుపతి-గూడూరు, రేణిగుంట-గూడూరు, గుంటూరు-కాచిగూడ, గుంటూరు-తిరుపతి, కాచిగూడ-గుంటూరు, హుబ్బళి-విజయవాడ, బెంగళూరు-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కానున్నాయి.వీటితోపాటు మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌-మచిలీపట్నం, విజయవాడ-ధర్మవరం, ధర్మవరం-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా రద్దయిన రైళ్ల లిస్టు లో ఉన్నాయని తెలిపారు.