ఏసీ విక్రయాల్లో సిండికేట్ల ఆగడాలు..షాపు యజమానిపై గొడ్డలితో దాడి

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 09:45 AM IST
ఏసీ విక్రయాల్లో సిండికేట్ల ఆగడాలు..షాపు యజమానిపై గొడ్డలితో దాడి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏసీ షాపు యజమాని భార్గవ్‌పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు.  భార్గవ్ పై ఏసీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఏసీ అమ్మకాల విషయంలో సిండికేట్ గా కొన్ని షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడ్డారు.

ఈ క్రమంలో సిండికేట్ లు నిర్ణయించిన ధరలకే ఏసీలను అమ్మాలని నిర్ణయించారు. కాకినాడలో ఏసీ షాపు యజమానిగా ఉన్న భార్గవ్ సిండికేట్ల మాటలు వినకుండా వారికంటే తక్కువ ధరలకే ఏసీలను అమ్ముతున్నాడని వారంతా భార్గవ్ పై కక్ష కట్టాడు. ఏసీలు అమ్మే షాపుల యజమానులంతా ఒక మాటమీదే ఉండాలని..వేసవి సీజన్ లో ప్రజలు అవసరమైన ఏసీలను అధిక ధరలకు అమ్మాలని..సీజన్ లోనే ప్రజల నుంచి డబ్బులు దండుకోవాలని..అవసరం వచ్చినప్పుడే బిజినెస్ ను పెంచుకోవాలని చెప్పారు. 

దీనికి ఒప్పుకోని భార్గవ సదరు సిండికేట్ల మాటలు వినకుండా వారికంటే తక్కువ ధరలకే అమ్ముతుండటంతో ఏసీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు భార్గవ్ పై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్గవ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు భార్గవ్ ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు.