10టీవీ ఎఫెక్ట్ : యువకుల్ని కొట్టిన పోలీసులపై ఐజీ సీరియస్..చర్యలు  

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 06:31 AM IST
10టీవీ ఎఫెక్ట్ : యువకుల్ని కొట్టిన పోలీసులపై ఐజీ సీరియస్..చర్యలు  

10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ ఆదేశించారు.  యువకులను కొట్టిన ఘటనలో నలుగురు పోలీసులను ఎస్పీ రాహుల్ హెగ్డే ఎటాచ్ చేయటంతో వారిపై ఐజీ చర్యలకు ఆదేశించారు.
 
కాగా..రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో న్యూఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా నలుగురు యువకులు మద్యం తాగారు. దీంతో పోలీసులు వారిని నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. ఈ దృశ్యాలను 10టీవీ ఎక్స్ క్యూజివ్ గా చిత్రీకరించి ప్రసారం చేసింది. ఇది ఐజీ నాగిరెడ్డి దృష్టికి వెళ్లటంతో ఆయన వెంటనే స్పందించారు. వెంటనే యువకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశించారు.