ఏపీ బడ్జెట్ : రాష్ట్రాభివృద్ధి లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 06:33 AM IST
ఏపీ బడ్జెట్ : రాష్ట్రాభివృద్ధి లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల శానససభలో ప్రవేశపెట్టారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మంత్రి సభలో వివరించారు. ఆర్థికశాఖ మంత్రిగా 11వ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని యనమల అన్నారు.

 

* నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం
* పసుపు-కుంకుమ తొలిదశలో రూ.8వేల 604కోట్ల ఇచ్చాం
* 93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది
* మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు ఇచ్చాం
* స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం
* హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు
* విభజనతో రాజధాని నగరాన్ని కోల్పోయాం
* ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు
* ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు
* దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరాశ, నిస్పృహలు పెరిగాయి
* 1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చాం