ఇసుక, మద్యం అక్రమ రవాణాకు చెక్ : అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారుల నియామకం

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 10:26 AM IST
ఇసుక, మద్యం అక్రమ రవాణాకు చెక్ : అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారుల నియామకం

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. స్పెషల్ పోలీసు ఆఫీసర్ల నియామకానికి రాష్ట్ర హోంశాఖ అర్హతలు ఖరారు చేసింది. మాజీ సైనిక ఉద్యోగులు, రిటైర్డ్ పారా మిలటరీ సిబ్బందికి అవకాశం ఇచ్చింది. మాజీ పోలీసు అధికారులు, మాజీ, ప్రస్తుత హోంగార్డులకు అవకాశం ఇచ్చింది.

అయితే 65 ఏళ్ల లోపు వయసు ఉండాలని నిబంధన పెట్టారు. పరీక్షల ద్వారా నియమించాలని సూచించింది. కానిస్టేబుల్ లేదా సమానమైన ర్యాంక్ లో పని చేసి ఉండాలని నిబంధన పెట్టారు. క్రిమినల్ కేసులు లేకుండా కెరీర్ లో శాఖాపరమైన చర్యలకు గురికాడదన్నారు. చెక్ పోస్టులు, మొబైల్ పార్టీల్లో ఉంటూ రెగ్యులర్ పోలీసులకు సాయం చేయాలన్నారు. ఏడాది కాలానికి నియామకం చేస్తున్నట్లు.. అనంతరం పనితీరును బట్టి రెన్యూవల్ చేస్తామని తెలిపింది. 

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా అక్రమమార్గాల్లో ఇసుక, మద్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ రవాణాలపై మరింత నిఘా పెట్టాలని సీఎం జగన్ భావించారు. స్మగ్లర్ల పని పట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టక్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ చెక్ పోస్టులు పటిష్టంగా పని చేయాలని ఈ విషయంలో కలెక్టర్లు పూర్తి బాద్యత తీసుకుని, అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.

దొరికినవారు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో చెక్‌పోస్టుల పనితీరును క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా వ్యక్తిగతంగా పర్యటించాలని ప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు గనులు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలకు అవసరమైన సహకారాన్ని అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ఏర్పాటుకు గతంలోనే సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. 

ప్రతి చెక్‌పోస్టు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి సీసీ పుటేజ్ ను భద్రపరిచి.. నిర్లక్ష్యం, అవినీతి తావు లేకుండా చేయాలన్నారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాదారుల పని పట్టాలని గతంలోనే సీఎం జగన్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.