విశాఖలో మెట్రో రైల్..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 03:56 PM IST
విశాఖలో మెట్రో రైల్..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో 79.91 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ కారిడార్, 60 కిలో మీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది. డీపీఆర్ ల రూపకల్పనకు కార్పొరేషన్లు అమరావతి రైలు కార్పొరషన్ పిలిచింది. ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి.

రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి ప్రాంత రైతులు గత మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే పూర్తిగా కట్టుబడ్డ వైసీపీ ప్రభుత్వం.. దీన్ని అమలు చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది. 

జ్యుడీషియల్ రాజధాని కర్నూలుకు పలు విభాగాలను ఇప్పటికే తరలించిన ప్రభుత్వం.. పరిపాలనా రాజధాని విశాఖకు సైతం పలు పలు విభాగాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖ తరలించేందుకు నిర్ణయించింది.