రిపోర్ట్ టూ HQ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ 

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 09:50 AM IST
రిపోర్ట్ టూ HQ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ 

హైదరాబాద్ : ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావును బదిలీ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 శుక్రవారం జీవో నంబర్‌ 750 జారీ చేసింది. ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఇంటెలిజెన్స్ డీజీను ప్రభుత్వం బదిలీ చేసింది. 

హైకోర్టు తీర్పు క్రమంలో ఈసీ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వెంకటేశ్వర్‌రావును పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించొద్దని కూడా ఆదేశించింది. అంతకుముందు సీఎం చంద్రబాబుతో ఏబీ వెంకటేశ్వరరావు సమావేశం అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు తీసుకుంది.

ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారుల బదిలీపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారుల బదిలీ సరికాదని.. ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.