ఇనమెట్లలో పోలీసులు హడావిడి : కోడెల కేసులో అరెస్టులు

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 02:52 AM IST
ఇనమెట్లలో పోలీసులు హడావిడి : కోడెల కేసులో అరెస్టులు

AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. డోర్ టు డోర్ జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఏప్రిల్ 11వ తేదీన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇనుమెట్లలో స్పీకర్ కోడెలపై దాడి జరిగింది. ఆయన పోలింగ్ బూత్‌కు చేరుకోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి దిగారు. కోడెల కారును తరిమారు. దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. కోడెల దుస్తులు చిరిగిపోయాయి. ఆయనతో పాటు డ్రైవర్‌కి గాయాలయ్యాయి. 

దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించారు పోలీసులు. సత్తెనపల్లి డివిజన్ నుండి 50 మంది పోలీసుల బృందం శనివారం ఇనుమెట్లకు చేరుకుంది. దాడి చేసింది ఎవరనేది గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. గ్రామం నుండి ఎవరినీ బయటకు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండడంతో వారిని గుర్తించేందుకు పోలీసులకు కష్టసాధ్యమౌతోంది పోలీసులకు.