డాక్టర్ భర్త..ప్రిన్సిపల్ భార్య దారుణం..ఇంట్లో పనిచేసే బాలుడిపై మరిగే నీరు పోసి..

  • Published By: nagamani ,Published On : September 7, 2020 / 03:40 PM IST
డాక్టర్ భర్త..ప్రిన్సిపల్ భార్య దారుణం..ఇంట్లో పనిచేసే బాలుడిపై మరిగే నీరు పోసి..

సిద్ధి ప్రసాద్ దేయోరి అనే వ్యక్తి అస్సాంలోని నాగావ్‌లోని రాహాకు చెందిన డాక్టర్. దిబ్రుఘర్‌లోని అసోం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య భావిభారత పౌరుల్ని తయారుచేసే బాధ్యత ఉన్న కాలేజీకి ప్రిన్సిపల్.భార్యాభర్తలిద్దరూ..బాధ్యతాయుతమైన వృత్తులో ఉన్నారు. కానీ వాళ్ల ఇంటిలో 12 ఏళ్ల బాలుడిని పనిచేయటంకోసం పెట్టుకున్నారు. ఇద్దరు చాలా ఉన్నత చదువులు చదువుకున్నవారే. బాల కార్మిక చట్టం గురించి తెలియనివారు కాదు. అయినా ఓ బాలుడ్ని ఇంట్లో పనికి పెట్టుకున్నారు..అంతేకాదు ఆ బాలుడితో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ..చిత్రహింసలకు గురిచేస్తున్నారు.


ఓ రోజు మద్యం మత్తులో ఉన్న ఓ డాక్టర్ సిద్ధి ప్రసాద్ దేయూరి ఇంట్లో పని చేసి చేసి అలసిపోయి పడుకున్న బాలుడిపై మరుగుతున్న వేడి నీళ్లు పోసి చిత్రహింసలకు గురి చేశాడు. అతని భార్య మిథాలి కోన్వార్ మోరాన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తోంది. ఇంట్లో పనిచేసి పడుకున్న ఆ బాలుడు నిద్రపోతుండగా…అప్పుడే నిద్రపోయావేంటిరా గాడిదా..పనుల్నీ ఎవడు చేస్తా డురా నీబాబు వచ్చి చేస్తాడా. అంటూ ఆగ్రహంతో మద్య మత్తులో ఉన్న డాక్టర్ బాలుడిపై వేడి నీళ్లు పోసాడు..దాంతో ఆ బాలుడు పాపం ఒళ్లంతా మంటతో ఏడుస్తుంటూ రాక్షసానందం పొందాడు.
https://10tv.in/ibp-8-jawans-walk-25-km-in-8-hours-to-hand-over-a-uttarakhand-man-dead-body/



ఈ విషయం బాలల హక్కుల సంఘం వారికి తెలియటంతో బాలుడిని పనిలో పెట్టుకోవటం నేరం..పైగా చిత్రహింసలు పెట్టే ఆ డాక్టర్ ని అతని భార్యని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అది నిజమేనని తేలటంతో డాక్టర్ ని అతని భార్యని శనివారం (సెప్టెంబర్ 8,2020) అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.