మే 23 తర్వాత ఫ్యాన్ ఇంటికి, గ్లాస్ బార్‌‌కి : బాలయ్య సెటైర్

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ,

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 04:51 AM IST
మే 23 తర్వాత ఫ్యాన్ ఇంటికి, గ్లాస్ బార్‌‌కి : బాలయ్య సెటైర్

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ,

అనంతపురం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ, జనసేనలపై సెటైర్లు వేశారు. ఎన్నికల తర్వాత ఫ్యాన్ ఇంటికి మాత్రమే పరిమితం అవుతుందని, గ్లాస్ బార్ కు పోతుందని అన్నారు.  అసెంబ్లీకి వెళ్లేది సైకిల్ మాత్రమేనని, రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని బాలకృష్ణ జోస్యం చెప్పారు.  
Read Also : ఇంటర్నేషనల్ ఇడ్లీ డే : ఇడ్లీ తినటంలో బెంగళూరే టాప్

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని పలు గ్రామాల్లో బాలకృష్ణ పర్యటించారు. వైసీపీకి వేసే ప్రతి ఓటూ మోడీకి వేసినట్లేనని అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే ఏపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలతో పోలిస్తే, మరిన్ని అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని బాలకృష్ణ చెప్పారు. నియోజకవర్గంలోని చెరువులకు నీరిచ్చామని, ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని బాలయ్య అన్నారు. ప్రచారంలో ఉన్న బాలయ్య ట్రాక్టర్ ను  నడిపి సందడి చేశారు.
Read Also : ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”