చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు

నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 08:14 AM IST
చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు

నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు

నెల్లూరు : చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు అని వైసీపీ చీఫ్ జగన్ ఏపీ ఓటర్లను కోరారు. ఎన్నికల వేళ చంద్రబాబు.. గ్రామాలకు డబ్బుల మూటలు పంపుతారని, రూ.3వేలు ఇచ్చి మీ ఓటు కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు పాలన మొత్తం మోసమే అని జగన్ అన్నారు. ఈ ఐదేళ్లు మోసాలు, అబద్దాలతో చంద్రబాబు గడిపేశారని.. ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు. గూడూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. ఈ తొమ్మిదేళ్లు మీ కష్టాలపైనే నా జీవితం నడిచింది అని జగన్ అన్నారు. పాదయాత్రలో రైతులు, ప్రజల కష్టాలు చూశానని చెప్పారు. గిట్టుబాటు ధరలు లేక బాధపడ్డ రైతులను చూశానని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక ఆస్తులు అమ్మకున్న వాళ్లను చూశానని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు విన్నానని తెలిపారు. ఆరోగ్యశ్రీ అమలు కాక, సరైన వైద్యం అందక అప్పులపాలైన వారిని చూశానన్నారు.

దుగరాజపట్నం పోర్టును కడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు పోర్టు అవసరం లేదంటున్నారని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టడానికి చంద్రబాబు ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జగన్ అన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యకుండా కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరులో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. గూడూరు ఫ్లై ఓవర్ అంగుళం కూడా ముందుకు కదల్లేదన్నారు. ఎన్నికలు రావడంతో చంద్రబాబు మళ్లీ కుట్రలకు తెరతీశారని, రాబోయే రోజుల్లో కుట్రలు తారస్థాయికి చేరతాయని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రాజకీయ వ్యవస్థను దిగజార్చారని వాపోయారు. రోజుకో కుట్ర చేస్తూ రాజకీయాలను నడిపిస్తున్నారని అన్నారు.