మందులు కొనటానికి వెళ్లి..మెడికల్ షాపుముందే చనిపోయాడు..6గంటలు అలాగే పడి ఉన్నమృతదేహం

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 01:03 PM IST
మందులు కొనటానికి వెళ్లి..మెడికల్ షాపుముందే చనిపోయాడు..6గంటలు అలాగే పడి ఉన్నమృతదేహం

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మందులు కొనుక్కునేందుకు మెడికల్ స్టోరుకు వచ్చాడు. లేని ఓపిక తెచ్చుకుని అక్కడి వరకూ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారి కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన బిహార్‌లోని భాగల్‌పూర్ నగరంలో చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి భయంతో అతని మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.వైద్య సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరూరాలేదు. దీంతో ఆరు గంటల పాటు ఆ శవం అక్కడే పడి ఉంది.

ఆస్తమాతో బాధపడుతున్న ఓ బాధితుడు మెడికల్ షాపునకు వచ్చి మందులు తీసుకుంటూనే కుప్పకూలాడు. వెంటనే షాపు యజమాని అతన్ని పరిశీలించగా ప్రాణాలుపోయినట్లుగా తెలిసింది. వెంటనే వైద్యసిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసాడు. కరోనా అనుకొని ఎవరూ అతన్ని ముట్టుకోవటానికి కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ షాపు ముందే దాదాపు ఆరుగంటల పాటు మృతదేహాం పడి ఉంది. కోవిడ్ కేర్ హెల్ప్ లైన్ సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు. చివరకు డిప్యూటీ మేయరు జోక్యంతో పీపీఈ కిట్లు ధరించిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు.