రామగుండం కార్పొరేషన్ బీజేపీదే

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 11:18 AM IST
రామగుండం కార్పొరేషన్ బీజేపీదే

రామగుండం కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆర్టీసీని చేసినట్లుగానే సింగరేణిని కూడా నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.

కాళేశ్వరం పేరు చెప్పుకొని కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. త్వరలో బీజేపీ రాష్ట్రంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసినట్టే సింగరేణిని కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందన్నారు.

కాగా..ఊహించని కీలక పరిణామాల మధ్య మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ ను మరోసారి సీఎంను చేసింది. ఈ జోష్ లో ఉన్న  బీజేపీ తెలంగాణపై పట్టు సాధిస్తామని ధీమాగా ఉంది. త్వరలోనే తెలంగాణపై బీజేపీ  బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోందని లక్ష్మణ్ అన్నారు.