తిరుపతిలో బాంబు పేలుడు 

ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 01:54 AM IST
తిరుపతిలో బాంబు పేలుడు 

ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.

ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది. నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు లాక్కెళ్లడంతో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఆటోలో తీసుకెళ్తున్న బాంబులను కుక్కలు నోటితో పట్టి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

బాంబు పేలుడు ఘటన తిరుపతి ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. బాంబు పేలుడు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు పేలిన పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబుల కోసం గాలిస్తుండగా సమీపంలో నిలిపి ఉంచిన ఆటోలో మరో ఆరు బాంబులను గుర్తించారు. అడవి పందుల కోసం నాటుబాంబులు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బాంబులు కవర్‌ను నోటకరిచి పట్టుకెళ్లిన కుక్క పేలుడులో మరణించింది. పేలుళ్ల సమయంలో సమీపంలో మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. నాటుబాంబులు పేలడం సంచలనంగా మారింది. బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేసింది. పేలుళ్లతో ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు.