కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్రం సమాధానం!

కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్రం సమాధానం!

Ap High Court:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం వివాదంగా మారి ఉన్న తరుణంలో.. ఏపీ హైకోర్టు తరలింపుపై రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు వేసిన ప్రశ్నపై కేంద్రం స్పందించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ సమాధానం ఇస్తూ.. ఫిబ్రవరిలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదన తెచ్చినట్లుగా చెప్పారు. హైకోర్టుతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల తరువాతే తరలింపుపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం ఏపీ హైకోర్టు (సబ్‌ జ్యూడీస్‌)పరిధిలో ఉందని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉన్నత న్యాయస్థానం తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని వెల్లడిస్తూ.. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.